పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్‌

3 Feb, 2017 01:28 IST|Sakshi

షికాగో: ప్రముఖ సితార్, సుర్‌బహార్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ ఇమ్రత్‌ ఖాన్ (82) ఇటీవలే తనకు కేటాయించిన ‘పద్మశ్రీ’ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పేరు ప్రఖ్యాతులకు ఈ అవార్డు తక్కువని.. అయినా చాలా ఆలస్యంగా తనను గుర్తించారన్నారు.

సెయింట్‌ లూయిస్‌లో ఉంటున్న ఉస్తాద్‌ను షికాగోలోని భారత కాన్సులేట్‌ అధికారులు సంప్రదించగా.. ‘నా జూనియర్లు ఎప్పుడో పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. దశాబ్దాలు ఆలస్యంగా నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు