వాషింగ్టన్/విశాఖ : విశాఖ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని ఓ సరస్సులో గల్లంతయ్యాడు. ఉన్నత చదవుల కోసం ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్ రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో ప్రమాదవశాత్తూ అవినాష్ గల్లంతయ్యాడని అతని స్నేహితులు వెల్లడించారు. అవినాష్ కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అవినాష్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడని తెలిసింది. ఎంఎస్ పూర్తి చేసిన అతను ఇటీవలే ఉద్యోగంలో చేరినట్టు సమాచారం.