'ఉత్తర కొరియాకు బుద్ధి చెబుదాం'

8 Jan, 2016 10:23 IST|Sakshi
'ఉత్తర కొరియాకు బుద్ధి చెబుదాం'

వాషింగ్టన్: అణుబాంబుకంటే ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియాకు అంతర్జాతీయ స్థాయిలో గట్టి బుద్ధి చెప్పాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి.

కొరియా అధ్యక్షుడు పార్క్ గెయిన్ హై, జపాన్ ప్రధాని షింజో అబేతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఫోన్లో మాట్లాడి ఉత్తర కొరియా సరిహద్దు దేశాల్లోని భద్రతపై చర్చించారు. ఉత్తర కొరియాపై సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం కూడా ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని గట్టిగా వ్యతిరేకించేలా చేయాలని ఆ ముగ్గురు నిర్ణయించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు