ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో జరగనున్న హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరు కావాలని పాకిస్తాన్ నిర్ణయించింది. అఫ్గానిస్తాన్ పరిస్థితులపై చర్చించేందుకు డిసెంబర్ 4న పంజాబ్లోని అమృత్సర్లో ఈ భేటీ జరగనుంది. ఆసియా ఖండంలోని 14 సభ్యదేశాలు పాల్గొంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు తోడు పాక్లో జరగాల్సిన సార్క్ సమావేశాలను భారత్ బహిష్కరించడం తెలిసిందే.