2030 కల్లా సాగరాల ‘మిస్టరీ’ చేధిస్తామంటున్న శాస్త్రవేత్తలు...
ప్రస్తుతం అత్యాధునిక శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకు రోజుకు నూతన ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ సువిశాల విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు తెరమరుగునే ఉండిపోతున్నాయి. చందమామ ఉపరితలం ఎలా ఉంటుంది? కుజ గ్రహంపై ఏముంటుంది ? అన్న విషయాల గురించి తెలుసు కాని సముద్రగర్భంలో ఏమేమి నిక్షిప్తమై ఉన్నాయి ? వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన సాధించలేకపోయాము.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని సముద్రాల అడుగున ఏముందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడమేంటీ అన్న ప్రశ్నల నుంచే ‘ద సీ బెడ్ 2030 ప్రాజెక్టు’ రూపుదిద్దుకుంది. వివిధ ఖండాల మీదుగా ఉన్న సముద్రగర్భాన్నంతా 2030 కల్లా ‘మ్యాపింగ్’ చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సముద్రం ద్వారా 2030 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆదాయం (2010లో 1.5 ట్రిలియన్ డాలర్లు) చేకూరుతుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంచనా. 2021–30 సంవత్సరాల మధ్యనున్న కాలాన్ని ‘ఓషియన్ సైన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’గా ఐరాస తీర్మానించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
దీని వెనక ఎవరు ?
జపాన్కు చెందిన దాతృత్వసంస్థ ‘నిపాన్ ఫౌండేషన్, ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ల కింద పనిచేసే జిబ్కో (లాభాపేక్ష లేని నిపుణుల సంఘం–సముద్రం అడుగున ఏముందని అన్వేషణలు సాగిస్తున్న సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పడింది. భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు సతీంతర్ బింద్రా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఏం చేస్తారు ?
ఎంత ఖర్చవుతుంది ?
-సాక్షి నాలెడ్జ్ సెంటర్