చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం

28 Oct, 2017 02:17 IST|Sakshi

బీజింగ్‌: ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహితౖ హైడ్రోజన్‌ ట్రామ్‌గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్‌ద్వారా తొలిసారిగా నార్త్‌ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్‌ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న  ఈ ట్రామ్‌ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

మరిన్ని వార్తలు