డబ్ల్యూటీవోలో భారత్ అనుకూల తీర్పు

10 Dec, 2014 00:59 IST|Sakshi

జెనీవా: భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల ఉక్కు ఉత్పత్తులపై అమెరికా ఏఎస్‌సీఎం ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా 300 శాతం సుంకాలను విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ డబ్ల్యూటీవో అప్పీలేట్ బాడీ తీర్పు వెలువరించింది. అమెరికా చర్యపై భారత్ 2012లో డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత జూలైలో డబ్ల్యూటీవో విచారణ జరిపింది. 

మరిన్ని వార్తలు