ఇకపై యూట్యూబ్‌ పెయిడ్‌ చానెల్స్‌

23 Jun, 2018 04:20 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: యూట్యూబ్‌లో ఇకపై పెయిడ్‌ చానెల్‌ సభ్యత్వం అందుబాటులోకి రానుంది. తద్వారా సృజనాత్మకత కలిగిన వారు మరింత డబ్బు సంపాదించుకునే వీలు కలుగుతుందని యూట్యూబ్‌ అధికారి నీల్‌ మోహన్‌ పేర్కొన్నారు. పెయిడ్‌ చానెల్‌కు సబ్‌స్క్రైబర్స్‌ నెలకు దాదాపు రూ.340 (4.99 డాలర్లు) చెల్లిస్తే, ఆ చానెల్‌లోని కొన్ని ప్రత్యేకమైన వీడియోలు, లైవ్‌ వీడియోలు తదితరాలను చూసే వీలు కల్పిస్తామని వివరించారు. ఇది లక్షకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న చానెళ్లకే వర్తిస్తుంది.

మరిన్ని వార్తలు