హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని అభివర్ణించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో దసరా కొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు. అందరికీ దుర్గామాత సుఖశాంతులు ప్రసాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.