స్కూళ్లకు బాంబు బెదిరింపు

20 Dec, 2017 15:14 IST|Sakshi

జగిత్యాల : రెండు ప్రైవేటు స్కూళ్లలో బాంబులు పెట్టామని ఓ ఆంగతకుడు ఫోన్‌ చేసి జగిత్యాల పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జగిత్యాలలోని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌ సిబ్బందిని హుటాహుటిన రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదంతంతో స్కూలు సిబ్బంది, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు బయటికి తెలియనివ్వడంలేదు. ఇప్పటి దాకా చుక్కారామయ్య, గౌతమి మోడల్‌ స్కూళ్లలో తనిఖీలు చేపడతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు