కరీంనగర్: కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులు ముందుకొచ్చారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు ఇందుకు అంగీకరించారు. కాలనీలో బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.