శివ శివా.. శివలింగంపై కాళ్లా!

9 Nov, 2017 03:14 IST|Sakshi

శివలింగంపై కాళ్లు పెట్టి పూజలు చేసిన స్వామీజీ

సాక్షి, బెంగళూరు: శివలింగంపై ఒక స్వామీజీ పాదాలు మోపి పూజలు చేయించుకున్న ఘటన కర్ణాటకలో సంచలనమైంది. ఆయన తీరుపై శైవ భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు.

ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఏడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు