తాంత్రిక పూజలపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు

5 Jan, 2018 12:06 IST|Sakshi

విజయవాడ : దుర్గగుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో దేవాదాయ శాఖ ఇంఛార్జి అదనపు కమిషనర్ రఘునాధ్, ఆగమ శాస్త్ర సలహా బోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామ శర్మ సభ్యులుగా ఉన్నారు. నేడు, రేపు కమిటీ విచారణ చేయనున్నారు. దుర్గగుడి ఈఓ కార్యాలయానికి విచారణ కమిటీ సభ్యులు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు