సాక్షి, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం రైలు ఇంజన్ను ట్రాక్ మారుస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. ఇంజన్కు బోగీలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. జరిగిన ప్రమాదం ప్రధాన ట్రాక్పై కాకపోవడంతో రైళ్లు యధాతథంగా నడుస్తున్నాయి.