పేద ప్రజలకు 2 వేల కూరగాయల కిట‍్ల పంపిణీ

26 Apr, 2020 21:45 IST|Sakshi

సాక్షి, బేతంచర్ల : వైఎస్సార్‌ సీపీ నాయకులు చలం రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలు, కార్మికులకు ఆదివారం కూరగాయల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు రెండు వేల కూరగాయల కిట్లను వారికి అందజేశారు. సీఐ కేశవ రెడ్డి తన చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముర్తుజావలి, మండల కన్వీనర్ లక్ష్మి రెడ్డి, నాయకులు బాబుల్ రెడ్డి, కాజా, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, రామచంద్రుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు