ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పితృవియోగం కలిగింది. శ్రీనివాసరెడ్డి తండ్రి రాఘవరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని వారి స్వగృహంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం రాఘవరెడ్డి భౌతిక కాయాన్ని వీరి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురానికి తరలిస్తున్నారు. గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.