డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, మహబూబాబాద్: గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పినట్టుగా ఖాళీగా ఉన్న 1.07 లక్షల పోస్టులను వచ్చే ఆగస్టు 15లోగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మహబూబాబాద్లో రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామ న్నారు.
పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలో రెండో నోటిఫికేషన్, ఏప్రిల్లో రాత పరీక్షలు ఉంటాయన్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల నేడు అబ్బాయిలు వెనుకబడిపోయి, ఏ పరీక్షల్లోనైనా అమ్మాయిలే ముందంజలో ఉంటు న్నారని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమ్మాయిలు ఉద్యోగాలు, అబ్బాయిలు ఇంట్లో వంట చేయాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని చమత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు బి.శంకర్నాయక్, కోరం కనకయ్య, ఎస్పీ ఎన్.కోటి రెడ్డి, జేసీ దామోదర్రెడ్డి పాల్గొన్నారు.