కాసిపేట : మండలంలోని ధర్మరావుపేట అటవీ ప్రాంతంలో గ్రామానికి చెందిన భుక్య తిరుపతి(32) మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన తిరుపతి సాయంత్రం సమయంలో మృతిచెంది ఉన్నట్లు పేర్కొన్నారు. విషపురుగులు కాటువేయడంతో మృతిచెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.