53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

27 Jun, 2020 12:08 IST|Sakshi

ఫేస్​బుక్​కు యాడ్స్ నిలిపేసిన కంపెనీలు

వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్​బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్‌ పే బ్యాన్‌? ఎన్‌పీసీఐ క్లారిటీ)

ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బాయ్​కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ డౌన్‌గ్రేడ్)

దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్​బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు