ఈ–పాస్‌ కష్టాలు ఇంతింత కాదయా..

13 Feb, 2018 15:08 IST|Sakshi

రామాయంపేట(మెదక్‌): రేషన్ దుకాణాల్లో అమర్చిన ఈ–పాస్‌ మిషన్లతో లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు వేలి ముద్రలు గుర్తించక ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు సిగ్నల్‌ కష్టాలూ వెంటాడుతున్నాయి.  మండల పరిధిలోని దంతేపల్లి గ్రామంలో సిగ్నల్‌ రాకపోవడంతో ఆ రేషన్ డీలర్‌ ఈ–పాస్‌ మిషన్ను పొలాల వద్దకు తీసుకెళ్లి లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయిస్తున్నాడు. దీంతో లబ్ధిదారులు రేషన్‌షాపుకు బదులుగా పొలాల వద్దకూ వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది.  

మరిన్ని వార్తలు