‘రోజా’ చిత్రం గుర్తుకు రాగానే, అందులోని ఆహ్లాదకరమైన పాటలు గుర్తొస్తాయి. సంగీతదర్శకుడిగా ఎ.ఆర్. రహమాన్కి అది తొలి చిత్రం. వాస్తవానికి స్వర్గీయ మహేశ్ మహదేవన్ (తెలుగు ‘ప్రేమించుకుందాం రా’ మ్యూజిక్ అతనిదే)ను సంగీతదర్శకుణ్ణి తీసుకోవాలని చిత్రదర్శకుడు మణిరత్నం అనుకున్నారు. కానీ, మహేశ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రహమాన్ని తీసుకున్నారు. ఆ చిత్రం రహమాన్కి మంచి బ్రేక్ అయింది.
‘రోజా’ చిత్రానికి పాటలెంత ప్లస్సో, కథానాయిక మధుబాల కూడా అంతే ప్లస్. మధుబాల అందం, అభినయం అందర్నీ ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ పాత్రకు మణిరత్నం ముందు ఐశ్వర్యా రాయ్ని ఎంపిక చేశారు. కానీ, తేదీలు ఖాళీ లేకపోవడంతో ఐష్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అది మధుబాలకు ప్లస్ అయ్యింది.