గీతానంద్, మైథిలి, కృష్ణ, హాసిని, సుధీర్ ముఖ్య తారలుగా సవీన్ ఇండ్ల, కుమార్బాబు.జి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘తెలిసీ తెలియక’. జయప్రకాష్.కె దర్శకుడు. నిర్మాతల్లో ఒకరైన కుమార్బాబు మాట్లాడుతూ -‘‘ప్రస్తుత ట్రెండ్కి తగ్గ కథ ఇది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.
క్లయిమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉండి, థ్రిల్కి గురి చేస్తుంది. ఈ సినిమా చూసి, రాజరాజేశ్వరి ఫిలింస్ అధినేత కృష్ణ విడుదల హక్కులు తీసుకున్నారు. ఆయనతో కలిసి మేం ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అని చెప్పారు.
వైవిధ్యమైన కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సవీన్ ఇండ్ల అన్నారు. ఇది విలువలున్న చిత్రమని కాదంబరి కిరణ్ చెప్పారు. యూత్ఫుల్ మూవీ అని పంపిణీదారుడు కృష్ణ చెప్పారు. సినిమా విజయం సాధించాలని టి. ప్రసన్నకుమార్ ఆకాంక్షించారు.