ఇంట్రస్టింగ్‌గా ‘నీవెవరో’ టీజర్‌

15 Jul, 2018 13:41 IST|Sakshi

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్‌ హిట్‌ అదే కంగల్‌ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు (ఆదివారం) చిత్రయూనిట్ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు