సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

5 Aug, 2019 16:35 IST|Sakshi

బుర్రకథ సినిమాతో రీసెంట్‌గా ఆడియెన్స్‌ను పలకరించిన ఆది సాయికుమార్‌కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్‌ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్‌క్రియేట్‌ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 

శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ షూటింగ్‌ పూర్తైనట్లు యూనిట్‌ ప్రకటించింది. ఇటీవలె టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు