విలేజ్‌ టు సిటీ

19 Jun, 2017 00:04 IST|Sakshi
విలేజ్‌ టు సిటీ

‘ఆకతాయి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఆశిష్‌ రాజ్‌ రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ చిత్రం నిర్మించిన వికెఏ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ముంబై భామ సిమ్రన్‌ కథానాయిక.

నిర్మాతలు విజయ్, కౌశల్, అనిల్‌ మాట్లాడుతూ– ‘‘ఆశిష్‌ రాజ్‌ కోసం చాలా కథలు విన్నాం. సుబ్రహ్మణ్యం చెప్పిన కథ బాగా నచ్చింది. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. వినోదం, యాక్షన్, థ్రిల్‌.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. జూలైలో షూటింగ్‌ ప్రారంభించి, దసరా కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్‌ జీకే.