యశవంతపుర (బెంగళూరు): బహుభాషా నటి జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న విక్రం ఆస్పత్రి వైద్యులు సతీశ్, విజయ చెప్పారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. వారు బుధవారం జయంతి తనయుడు కృష్ణకుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో వెంటిలేటర్ తొలగించి ఆమెను సాధారణ వార్డుకు బదిలీ చేస్తామని తెలిపారు.