సోషల్‌ మీడియా కథనాలపై నటి రాధిక

22 May, 2018 15:05 IST|Sakshi
నటి రాధికా శరత్‌కుమార్‌

సాక్షి, చెన్నై: సోషల్‌ మీడియా పుణ్యామాని మంచితోపాటు.. అదే స్థాయిలో అడ్డగోలుగా ఫేక్‌ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. సెలబ్రిటీలకు ఆ కథనాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె బ్లడ్‌ కాన్సర్‌తో బాధపడుతున్నారంటూ కొన్ని వెబ్‌ సంస్థలు ప్రచురించాయి. దీంతో ఆ వార్త వైరల్‌ అయ్యింది. దీనిపై ఓ అభిమాని ట్విటర్‌ వేదికగా రాధికను ప్రశ్నించారు. దానికి సింపుల్‌గా ఆమె ‘అది నిజం కాదు.. కల్పితం’ అంటూ సమాధానమిచ్చారు. గతేడాది రవితేజ రాజా ది గ్రేట్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం తమిళం, మళయాళంలో ఒక్కో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు