ఓటు వేయని రమ్య, నెం.1 సిటిజన్‌

14 May, 2018 09:23 IST|Sakshi
నటి రమ్య

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ఆక్రోశం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని కాంగ్రెస్‌ నాయకురాలు, నటి రమ్యపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తమవుతోంది. మండ్యలోని కేఆర్‌ రోడ్డులోని పీఎల్‌డీ బ్యాంక్‌ పోలింగ్‌ కేంద్రంలో రమ‍్యకు ఓటు ఉంది.  అయితే ఆమె ఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనేక విమర్శలు చేసిన రమ్యను అనేకులు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు. ఓటు వేయని రమ్య నెంబర్‌ వన్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు.

మరిన్ని వార్తలు