మహాసముద్రంలో ఆ ముగ్గురు

24 Jun, 2020 01:18 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో సంచలన విజయం సాధించారు దర్శకుడు అజయ్‌ భూపతి. ఆ చిత్రం తర్వాత ‘మహాసముద్రం’ అనే కథను తయారు చేసుకున్నారాయన. కథరీత్యా ఇందులో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంటుంది. కథ విని ఇద్దరు ప్రముఖ హీరోలు ఈ కథకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే వార్తలు కూడా షికారు చేశాయి. కారణమేదైనా ఆ హీరోలిద్దరూ ఈ సినిమా చేయడంలేదట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి హీరోలుగా శర్వానంద్, సిద్ధార్థ్‌ వచ్చారని సమాచారం. హీరోయిన్‌గా అదితీ రావ్‌ హైదరీని ఎంపిక చేశారని తెలిసింది.  

మరిన్ని వార్తలు