మహా సముద్రం: శర్వా సరసన అదితి

6 May, 2020 14:59 IST|Sakshi

‘అర్‌ఎక్స్‌100’తో సూపర్‌ విజయాన్ని అందుకున్న  దర్శకుడు అజయ్‍ భూపతి. తాజాగా ఆయన ఇద్దరు కథా నాయకులతో ‘మహా సముద్రం’ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్‍, సిద్ధార్థ్ కలిసి నటించబోతున్నారు. ‘బొమ్మరిల్లు’తో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న సిద్ధార్థ్‌ పలు చిత్రాల్లో నటించిన అనంతరం తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అజయ్‌ భూపతి చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈ చిత్రంలో శర్వానంద్‌ సరసన హీరోయిన్‌ అదితిరావు హైదరీని చిత్రబృందం ఎంపిక చేసింది. దీంతో తెలుగు తెరపై మరొ కొత్త జోడి సందడి చేయనుందని సినీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందులో ఒకే హీరోయిన్‌కు అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ చివరికి అదితి వైపే చిత్రబృందం మొగ్గు చూపింది.  ఇక అదితి సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో నటన పరంగా అదితికి మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగారాలేదు. ఇక ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. 

చదవండి:
‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’
ఆ అకౌంట్‌ నాది కాదు.. స్వాతి క్లారిటీ

మరిన్ని వార్తలు