సాయిపల్లవి ఔట్, అతిథి రావ్ ఇన్

20 Apr, 2016 18:06 IST|Sakshi
సాయిపల్లవి ఔట్, అతిథి రావ్ ఇన్

చెన్నై:  ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం చేయబోతున్న తదుపరి సినిమాలో హీరోయిన్ గా అతిథి రావ్ హిరానీకి బంపర్ ఆఫర్ దక్కింది.  కార్తీ హీరోగా రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

సాయి పల్లవి మరో సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టు నుంచి దూరమైనట్టు సమాచారం. దీంతో ఈ అవకాశం అతిథికి దక్కింది. కార్తీక్ ఈ చిత్రంలో పైలట్ గా నటించనున్నాడు.  రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుంది. ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.