తెలుగులో బంగారం..హిందీలో జాను!

21 May, 2016 23:25 IST|Sakshi
తెలుగులో బంగారం..హిందీలో జాను!

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెలుగులోనే కాదు తమిళంలో (‘ఓకే కన్మణి’)  కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా రాయ్, శ్రద్ధా కపూర్ జంటగా షాద్ అలీ దర్శకత్వంలో ప్రముఖ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఓకే జాను’ని విడుదల చేస్తున్నట్లు కరణ్ ప్రకటించారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.