అడవి శేష్‌.. ‘ఎవరు’?

3 Jun, 2019 15:59 IST|Sakshi

గూఢచారి సినిమాతో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించారు అడవి శేష్‌. హీరోగానే కాకుండా కథకుడిగానూ మెప్పించిన ఈ హీరో గూఢచారికి సీక్వెల్‌ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇదే కాకుండా 2స్టేట్స్‌ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. తాజాగా ఈ హీరో మరో చిత్రాన్ని ప్రకటించాడు.

అడివి శేష్‌, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ కూడా దాదాపు పూర్తి కావల్సివస్తుంది. నేడు ఈ మూవీ పోస్టర్‌, టైటిల్‌ను ప్రకటించాడు. ‘ఎవరు’గా రాబోతోన్న ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కిస్తుండగా.. వెంటక్‌ రామ్‌జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానున్నట్లు ప్రకటించాడు.

మరిన్ని వార్తలు