థ్రిల్‌ చేసే ‘ఎవరు’

17 Jul, 2019 08:29 IST|Sakshi

‘క్షణం, అమీ తుమీ, గూఢచారి’ వంటి వరుస విజయాల తర్వాత అడివి శేష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నవీన్‌ చంద్ర కీలక పాత్ర చేశారు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌15న విడుదల కానుంది. ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ‘క్షణం’ వంటి హిట్‌ తర్వాత అడివి శేష్, పీవీపీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

మరిన్ని వార్తలు