కన్నడంలోకి ఎవరు

12 Apr, 2020 05:29 IST|Sakshi
దిగంత్‌

గత ఏడాది మంచి విజయం సాధించిన సినిమాల్లో అడవి శేష్‌ నటించిన ‘ఎవరు’ ఒకటి. వెంకట్‌ రాంజీ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య  పాత్రల్లో నటించారు. స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్‌ విజిబుల్‌ గెస్ట్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ‘ఎవరు’లోని ట్విస్ట్‌ లు తెలుగు ఆడియన్స్‌ ను బాగా థ్రిల్‌ చేశాయి. ఆ థ్రిల్‌ ను  కన్నడ ఆడియన్స్‌  కూడా ఆస్వాదించబోతున్నారని  తెలిసింది. ఈ చిత్రం కన్నడంలో రీమేక్‌ కానుంది. దిగంత్‌  అనే కన్నడ నటుడు ఈ రీమేక్‌ లో హీరోగా కనిపిస్తారట. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు