అమెరికాలో గూఢచారి

22 Feb, 2018 00:11 IST|Sakshi
అడివి శేష్

అడివి శేష్, మిస్‌ ఇండియా శోభిత ధూళిపాళ్ల జంటగా నటిస్తోన్న చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌–విస్టా డ్రీమ్‌ మర్చంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ అమెరికాలో జరుగుతోంది. అడివి శేష్‌ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.

నిర్మాతలు అభిషేక్‌ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కొత్త కాన్సెప్ట్‌తో ‘గూఢచారి‘ తెరకెక్కుతోంది. అడివి శేష్‌ గూఢచారి పాత్రను అద్భుతంగా చేస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది.  ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానిల్‌ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

మరిన్ని వార్తలు