మెగాస్టార్ అవుట్.. టాప్ హీరోయిన్కి చాన్స్..!

18 May, 2017 13:28 IST|Sakshi

వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా తనకు తిరుగులేదని కౌన్ బనేగా కరోడ్ పతి షోతో ప్రూవ్ చేసుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 90లలో ప్రారంభమైన ఈ టీవీ షోను 2014 వరకు నిరాటంకంగా కొనసాగించారు అమితాబ్. అంతేకాదు అమితాబ్ స్ఫూర్తితో చాలా మంది సౌత్ స్టార్స్ ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే త్వరలో మరో కొత్త సీజన్తో కేబీసీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్లో అమితాబ్ హోస్ట్గా కనిపించరని తెలుస్తోంది.

గతంలోనూ కౌన్ బనేగా కరోడ్ పతి హోస్ట్గా రణబీర్ కపూర్ను తీసుకోవాలని భావించారు. అయితే ఎందుకో నిర్మాతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ స్థానంలో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నారట. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్లలో ఒకరిని కేబీసీ కొత్త సీరీస్కు వ్యాఖ్యతగా ఫైనల్ చేసే ప్లాన్లో ఉన్నారు. త్వరలోనే కొత్త సీజన్పై అధికారిక ప్రకటన వెలువడనుంది.