పాటతో మొదలు

11 May, 2018 00:21 IST|Sakshi
డి. ఇమ్మాన్‌, అజిత్‌

అజిత్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’ సాంగ్‌ షూట్‌ మధురైలో జరుగుతోందట. అదెలా... సాంగ్‌ షూట్‌ మధురైలో జరుగుతుంటే అజిత్‌ హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారబ్బా? అని ఆలోచనలో పడకండి. ఎందుకంటే హైదరాబాద్‌లోనే మధురై సెట్‌ వేశారు. అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో సాంగ్‌తో మొదలైంది. ఈ సాంగ్‌ కంప్లీట్‌ అయిన తర్వాత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆల్మోస్ట్‌ నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే షూట్‌ చేయనున్నారు. ‘‘మ్యాన్‌ ఆఫ్‌ సింప్లిసిటీ అజిత్‌ నా పాటకు డ్యాన్స్‌ చేయడమే కాకుండా... నన్ను సెట్స్‌కు ఆహ్వానించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమ్మాన్‌.

>
మరిన్ని వార్తలు