అఖిల్‌కు జోడిగా ప్రియాంక!

26 Feb, 2019 13:01 IST|Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న సినిమాలో అఖిల్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. త్వరలో లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా ఏప్రిల్‌ నుంచి పట్టాలెక్కనుంది.

మరిన్ని వార్తలు