కొత్త కాంబినేషన్‌ గురూ

17 Nov, 2019 03:09 IST|Sakshi
అఖిల్‌

ఈ ఏడాది అక్టోబర్‌లో తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌తో (‘అభిమన్యుడు’ ఫేమ్‌) కలిసి ‘హీరో’ మూవీ సెట్‌లో సందడి చేశారు కథానాయకుడు అఖిల్‌. అప్పటి ఈ మీటింగ్‌ అఖిల్‌ హీరోగా పట్టాలెక్కబోయే సినిమా కోసమేనని తాజా సమాచారం. అఖిల్‌ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నారు అఖిల్‌. శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్‌. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది.

మరిన్ని వార్తలు