ఈ ఏడాది అక్టోబర్లో తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్తో (‘అభిమన్యుడు’ ఫేమ్) కలిసి ‘హీరో’ మూవీ సెట్లో సందడి చేశారు కథానాయకుడు అఖిల్. అప్పటి ఈ మీటింగ్ అఖిల్ హీరోగా పట్టాలెక్కబోయే సినిమా కోసమేనని తాజా సమాచారం. అఖిల్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు అఖిల్. శివ కార్తికేయన్తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది.