సమ్మర్‌లో కలుద్దాం

15 Oct, 2019 00:21 IST|Sakshi
అఖిల్‌

... అని అఖిల్‌ అంటున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఓ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు