మేలో మొదలు

22 Mar, 2019 02:31 IST|Sakshi
అఖిల్‌

అఖిల్‌ కొత్త చిత్రం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఓ న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ – కామెడీ కథను భాస్కర్‌ తయారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు. కియారా అద్వానీ పేరు వినిపిస్తునప్పటికీ చిత్రబృందం మాత్రం తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే మొదటివారంలో ప్రారంభం కానుందట.  2019 చివరి కల్లా ముగించి, ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

మరిన్ని వార్తలు