వేసవిలో వస్తున్నాం!

1 Feb, 2020 00:07 IST|Sakshi
అఖిల్

వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యారు హీరో అఖిల్, దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌. అందుకే చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. అఖిల్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఓ రొమాంటిక్‌ కామెడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అఖిల్, పూజా  కెమిస్ట్రీ ఈ ప్రేమ కథలో హైలెట్‌గా ఉంటుందట. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్‌తో సినిమా ప్రథమార్ధం పూర్తయిందని తెలిసింది. ఈ నెల మొదటివారం నుంచి తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మార్చి చివరి వారంలోగా షూటింగ్‌ పూర్తి చేసి,  ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీత దర్శకుడు.  

మరిన్ని వార్తలు