నాగ్‌ క్లాప్‌.. సల్మాన్‌ కెమెరా ఆన్‌

26 Mar, 2018 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అక్కినేని అఖిల్‌ మూడో చిత్రం అధికారికంగా లాంఛ్‌ అయ్యింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ చిత్రం ఉండబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

సీనియర్‌ హీరో, అఖిల్‌ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశాడు. 

థమన్‌ మ్యూజిక్‌ అందించబోతున్న ఈ చిత్రానికి జార్జ్‌ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్‌వీఎస్‌సీ) బ్యానర్‌లో  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు