ఫారిన్‌ ప్రయాణం

30 Oct, 2019 02:18 IST|Sakshi
అఖిల్‌

ప్రేయసితో ఆటా పాటా, విలన్ల తాట తీయనున్నారు అఖిల్‌. దీనికోసం విదేశాలు వెళ్లారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఫారిన్‌లో జరగనుందని సమాచారం. సౌదీ అరేబియాలో షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్, పాటను చిత్రీకరించబోతున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజులు సాగుతుందట. జీఎ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్‌ స్వరకర్త.

>
మరిన్ని వార్తలు