ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ యాక్షన్తో పాటుగా సామాజిక సందేశాలు ఇచ్చే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అక్షయ్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మంగళ్’ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో మరో కొత్త సినిమాకు కూడా ‘ఖిలాడి’ ఓకే చెప్పాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న ‘బచ్చన్ పాండే’ సినిమాతో అభిమానులను అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి శుక్రవారం తన ఫస్ట్లుక్ విడుదల చేసిన అక్కి... మాస్ మసాలాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హింట్ ఇచ్చాడు. నల్ల లుంగీ ధరించి మెడలో పెద్ద బంగారు గొలుసులు వేసుకుని, నుదుట తిలకంతో అక్షయ్ కొత్తగా కనిపిస్తున్నాడు.
కాగా ఇది పూర్తిగా వినోదంతో కూడిన మాస్ సినిమా అని, గతంలో అక్షయ్ డబుల్ రోల్లో నటించిన ‘రౌడి రాథోడ్’ తరహలోనే ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతానికి మిషన్ మంగళ్ రీలీజ్ కోసం ఎదురుచుస్తున్న అక్షయ్.. ఆ సినిమా విడుదల తర్వాత ‘బచ్చన్ పాండే’ షూటింగ్ మొదలెడతాడని, వచ్చే ఏడాది అంటే 2020 క్రిస్మస్కి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం.
Coming on Christmas 2020!
— Akshay Kumar (@akshaykumar) July 26, 2019
In & As #BachchanPandey 😎
In #SajidNadiadwala’s Next, directed by @farhad_samji @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/ayMkzwPEsJ