సీఎంతో అక్షయ్ కుమార్ భేటీ

29 Sep, 2015 19:38 IST|Sakshi
సీఎంతో అక్షయ్ కుమార్ భేటీ

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్షయ్ చర్చించారు.

తన తాజా చిత్రం సింగ్ ఈజ్ బ్లింగ్ ప్రమోషన్ కోసం ఢిల్లీ వచ్చిన అక్షయ్.. కేజ్రీవాల్తో 30 నిమిషాలు మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల గురించి ఇద్దరూ చర్చించారు. రైతులను ఆదుకునేందుకు ఎలాంటి సాయం చేయాలి అన్న విషయంపై మాట్లాడారు. 100 రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిధులు సేకరించారు.