అందుకే వద్దనుకున్నా!

19 Feb, 2019 03:12 IST|Sakshi
అజయ్‌ దేవగణ్‌

రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ (‘రోబో’కు సీక్వెల్‌) సినిమాలో విలన్‌గా కనిపించారు అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’ (‘భారతీయుడు’ సీక్వెల్‌). ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదన్నారు అజయ్‌. ‘‘శంకర్‌ దర్శకత్వంలో నటించడం నాకు ఇష్టమే. ‘ఇండియన్‌ 2’ సినిమాకోసం చర్చలు జరిగాయి. కానీ ప్రస్తుతం నేను ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే కుదర్లేదు’’ అని చెప్పారు  అజయ్‌దేవగణ్‌. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ చేస్తున్న ‘తానాజీ...’ ఆయనకు నూరవ చిత్రం కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన అజయ్‌ ‘టోటల్‌ ధమాల్‌’ను పాకిస్తాన్‌లో విడుదల చేయకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు