భలే చాన్సులే!

9 Nov, 2018 06:17 IST|Sakshi
అక్షయ్‌ కుమార్, కష్మీరా పరదేశి

‘మిషన్‌ మంగళ్‌’ అంటూ  స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ని తోడుగా తీసుకెళ్తున్నారు. జగన్‌ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. భారతదేశం చేసిన మిషిన్‌ మార్స్‌ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌తో పాటు మరో భామ కూడా ఈ చిత్రానికి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్‌ కష్మీరా పరదేశి కూడా ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేశారు.

మరిన్ని వార్తలు