డబ్బు రుచితో అడ్డదారి...

4 Oct, 2013 00:08 IST|Sakshi
డబ్బు రుచితో అడ్డదారి...
 డా.రాజేంద్రప్రసాద్ యముడిగా నటిస్తున్న చిత్రం ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్‌తేజ్, విదర్ష జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరాహ దర్శకుడు. బి.చిరంజీవులు నాయుడు నిర్మాత. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘వాణిజ్య అంశాల మేలు కలయిక ఈ సినిమా. కామెడీతో పాటు చక్కని సందేశం కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపుతూ వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలి చారు.
 
 ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతాయి’’ అని తెలిపారు. డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతాడు? తద్వారా ఎంత నష్టపోతాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు.. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: సతీష్, కళ: చిన్నా.